నవంబర్ 23వ తేదీన జహీర్ ఖాన్- సాగరిక వివాహం జరిగింది. పెళ్లి తరువాత బంధుమిత్రులకు విందు ఏర్పాటు చేసాడు జహీర్. తాజాగా ముంబైలోని తాజ్ లాండ్స్ లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమానికి భారత జట్టు ఆటగాళ్లు, పలువురు మాజీ ఆటగాళ్లు హాజరయ్యారు. ఈ విందు కార్యక్రమంలో జహీర్ ఖాన్- సాగరిక జంటతో పాటు విరాట్-అనుష్క జంట కూడా సందడి చేసింది. ఈ కార్యక్రమంలో వీరూ- అనుష్క శర్మ జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జహీర్ ఖాన్-సాగరిక జంటతో కలిసి స్టేజిమీద విరాట్-అనుష్క స్టెప్పులేశారు. ఈ విందు కార్యక్రమానికి సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, సానియా మీర్జా, ఆశిష్ నెహ్రా, యువరాజ్ సింగ్ తో పాటు అజిత్ అగార్కర్, హర్భజన్ సింగ్, పలువురు బాలీవూడ్ ప్రముఖులు హాజరయ్యారు.