Telangana Covid-19 Update: తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 68,720 నమూనాలను పరీక్షించగా.. 1,380 మందికి (Corona Cases in Telangana) కొవిడ్ సోకింది. వైరస్ తో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.  దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,101కి పెరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 7,78,910కి చేరింది. తెలంగాణ వ్యాప్తంగా  ప్రస్తుతం 24 వేలు యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ పేర్కొంది. కరోనా నుంచి ఒక్కరోజులో 3,877 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 96.39గా ఉన్నట్లు తెలిపింది. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో 350 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.


దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 83,876 కరోనా కొత్త కేసులు (Corona  Cases in India) వెలుగుచూశాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 7.25 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 11,08,938 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. వైరస్ తో తాజాగా 895 మంది మృతి చెందారు. ఒక్క రోజులోనే 1,99,054 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. 


Also Read: Case on Youtuber Sarayu: బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ, యూట్యూబర్ సరయూపై కేసు నమోదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook