Adilabad Accident: ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోయాయి. ప్రమాదాల నివారణకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రతి రోజు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident in Adilabad district) జరిగింది. కంటైనర్‌ను కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం గుడిహత్నూర్‌ మండలం సీతాగొంది వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న కారు ఓ కంటైనర్‌ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఓ మహిళ ఉన్నారు. మరొక మహిళకు గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన మహిళను రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  మృతులంతా ఆదిలాబాద్ జిల్లా వాసులగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.  ఓవర్‌టెక్‌ చేయడం, మద్యం తాగి వాహనాలు నడపం, అతి వేగం తదితర కారణాల వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. 


Also Read: Cable Bridge Collapsed: కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో 60 దాటిన మృతుల సంఖ్య 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook