హైదరాబాద్‌ : తెలంగాణలో శనివారం కొత్తగా మరో 43 కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నేడు నమోదైన 43 కరోనా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 31 కేసులు నమోదు కాగా, గద్వాల్‌‌ జిల్లాలో 7, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2, రంగారెడ్డి జిల్లాలో 2, నల్గొండ జిల్లాలో ఒకటి ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనావైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 809 చేరింది. ఈ మేరకు శనివారం రాత్రి తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి 186 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 18 మంది మృతి చెందారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం రాష్ట్రంలో 605 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..