6th Calss Student dead in Sai Krupa High School in Krishna Nagar: హైదరాబాద్ మహా నగరంలో దారుణం చోటుచేసుకుంది. తరగతి గదిలోనే విద్యార్థులు గొడవపడడంతో.. ఓ స్టూడెంట్ మృతి చెందాడు. ఈ ఘటన కృష్ణా నగర్‌లోని సాయి కృప పాఠశాలలో చోటుచేసుకుంది. వాటర్ బాటిల్స్‌తో కొట్టుకోవడంతోనే ఈ దారుణం జరిగినట్టు సమాచారం తెలుస్తోంది. విద్యార్ధి మృతికి క్రికెట్ ఆట కారణం అని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కృష్ణా నగర్‌లోని సాయి కృప స్కూల్ విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. పదో తరగతి చదవుతున్న ఆరుగురు విద్యార్థులు తరగతి గదిలోనే గొడవకు దిగారు. గతంలో క్రికెట్ ఆటలో జరిగిన ఘర్షణను తెరపైకి తెచ్చి.. మరోసారి తరగతి గదిలో గొడవ పడ్డారు. అందరూ వాటర్ బాటిల్స్‌తో కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఆరో తరగతి చదువుతున్న మన్సూర్ అనే విద్యార్థి మృతి చెందాడు.


విషయం తెలుసుకున్న సాయి కృప స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు వచ్చి తరగతి గదిలోని పరిసరాలను పరిశీలించారు. ఆ గదిలోని సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక విషయం తెలుసుకున్న విద్యార్ధి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ మృతిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 


Also Read: Shriya Saran Husband: అరుదైన వ్యాధి.. కూతురిని కూడా ఎత్తుకోలేని పరిస్థితిలో స్టార్ హీరోయిన్ భర్త!!


Also Read: Pooja Hegde Photos: బుల్లి గౌనులో సందడి చేస్తున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook