వరంగల్ : మైనార్టీలకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 12% రిజర్వేషన్‌ని ప్రతిపాదించారు బాగానే ఉంది కానీ ఎస్సీలు, ఎస్టీలు లేదా ఓబీసీల నుంచి రిజర్వేషన్ కోటాను వెనక్కి తీసుకోకుండా మైనార్టీలకు రిజర్వేషన్‌ని అందివ్వడం అసాధ్యం అనే సంగతి ఆయన గ్రహించాల్సి ఉంటుంది అని అన్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ వరంగల్‌లో జరిగిన బహిరంగ సభలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన అమిత్ షా.. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకమేనని అన్నారు. అంతేకాకుండా మరేవ్వరూ కూడా అటువంటి పనిచేయకుండా ఉండేందుకు బీజేపీ అన్ని విధాల కృషిచేస్తుందని అమిత్ షా తేల్చిచెప్పారు.