Osmania Examinations: కరోనా థర్డ్‌వేవ్ ప్రభావం పరీక్షలపై పడుతోంది. తెలంగాణలోని ఉస్మానియా యూనివర్శిటీ పరీక్షలు కరోనా వైరస్ సంక్రమణ కారణంగా వాయిదా పడ్డాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తెలంగాణలో రోజుకు 3 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో 90 శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంట్ అని ఇప్పటికే స్పష్టమైంది. సంక్రాంతి సెలవుల్ని కూడా తెలంగాణలో ఈ నెల 31 వరకూ పొడిగించింది ప్రభుత్వం. మరోవైపు పలు విద్యాలయాలు తిరిగి ఆన్‌లైన్ క్లాసులవైపు దృష్టి సారిస్తున్నాయి. కరోనా సంక్రమణ ప్రభావం (Corona Effect) ఇప్పుడు తెలంగాణలోని వివిధ పరీక్షలపై పడుతోంది.


ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఇప్పుడు హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ(Osmania Exams)పరిధిలో జరగనున్న అన్ని పరీక్షల్ని నిరవధికంగా వాయిదా వేసింది రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ. ఉస్మానియా యూనివర్శిటీలో పరిధిలో జనవరి 17 నుంచి జనవరి 31 వరకూ జరగాల్సిన అన్ని పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలిపింది. 


Also read: Omicron in Telangana: షాకింగ్ న్యూస్.. తెలంగాణ కరోనా కేసుల్లో 90% ఒమిక్రాన్ లక్షణాలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook