తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు ఓ మోస్తరుగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana) 2 లక్షలు దాటిపోయాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,335 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో 8 మంది మృతి చెందారు. తాజా కేసులలో జీహెచ్ఎంసీ పరిధిలో 262 మంది కరోనా కరోనా బాధితులున్నారు. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,00,611కు చేరింది. అదే సమయంలో తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 1,171కు పెరిగింది. నిన్న ఒక్కరోజు 2,176 మంది కోవిడ్19 నుంచి రికవరీ కావడం విశేషం. చికిత్స అనంతరం రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,72,388 (1 లక్షా 72 వేలు) మంది కోలుకున్నారు. ప్రస్తుతం 27,052 యాక్టివ్ కేసులుండగా.. అందులో 22,134 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe