Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతుండంగా.. నిన్న రెండువేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో బుధవారం ( అక్టోబరు 7 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 1,896 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 12 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులతో.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,06,644 కి చేరగా.. మరణాల సంఖ్య 1,201 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Sasikala: చిన్నమ్మకు భారీ షాక్.. 2వేల కోట్ల ఆస్తుల జప్తు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 1,79,075 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం తెలంగాణలో 26,368 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 86.65 శాతం ఉండగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. Also read: Pralhad Joshi: మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్


ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా బుధవారం 50,367 కరోనా టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో అక్టోబరు 7వ తేదీ వరకు రాష్ట్రంలో 33,96,839 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. అయతే... నిన్న అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో కొత్తగా 294 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 211 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి..


[[{"fid":"194547","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."}},"link_text":false,"attributes":{"alt":"telangana corona cases bulletin ","title":"తెలంగాణలో కరోనా కేసులు..","class":"media-element file-default","data-delta":"1"}}]]


Also read: Fake universities list: 24 నకిలీ విశ్వవిద్యాలయాలను గుర్తించిన యూజీసీ