తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వరుసగా రెండో రోజు పెరిగింది. గత వారం 1500కు దిగువన నమోదైన కేసులు తాజాగా అంతకుమించి వస్తున్నాయి. కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగించే అంశమే. మంగళవారం రాత్రి 8 గంటల వరకు తాజాగా 1,637 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపితే తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,44,143కి చేరింది.



 


రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 1,357కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. మంగళవారం 45,526 శాంపిల్స్‌ని పరీక్షించగా 1,637 మందికి పాజిటివ్‌‌గా నిర్ధారించారు. నిన్న ఒక్కరోజే 1,273 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 44,39,856 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు బులిటెన్‌లో పేర్కొంది.



 


తెలంగాణలో ఇప్పటివరకు 2,24,686 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 18,100 యాక్టివ్‌ కేసులుండగా.. అందులో 15,335 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధి (GHMC)లో తాజాగా 292 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా రికవరీ రేటును జాతీయ రికవరీ రేటు తాజాగా అధిగమించింది. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 92.03శాతం ఉండగా, జాతీయ సగటు 92.1శాతానికి చేరుకుంది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe