Coronavirus Telangana Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కోవిడ్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గతంలో నమోదైన కేసులను పోల్చుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో (జనవరి 2న) శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 394 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా ముగ్గురు (3) ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ (TS Health Ministry) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల (positive cases) సంఖ్య 2,87,502 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,549 కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.58 శాతం ఉండగా.. మరణాల రేటు 0.53 శాతం ఉంది. Also read: Punjab సీఎంను చంపుతామంటూ పోస్టర్.. కేసు నమోదు


కేసులతోపాటు (Telangana)  నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. కరోనా నుంచి నిన్న 574 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,80,565 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 5,388 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. Also Read: Heavy Rain In Delhi: దేశ రాజధానిని వణికిస్తున్న చలి, వర్షం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook