Coronavirus Telangana Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కోవిడ్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గతంలో కంటే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. నిత్యం 500లకు లోపే కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో (జనవరి 4న) సోమవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 253 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ముగ్గురు (3) మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ (TS Health Ministry) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల (positive cases) సంఖ్య 2,87,993 కి చేరగా.. మరణాల సంఖ్య 1,554 కి పెరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేసులతోపాటు (Covid-19) నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. కరోనా నుంచి నిన్న 317 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,81,400 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 5,039 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. Also Read: COVID-19 New Strain: దేశంలో 38కి చేరిన కొత్త రకం కరోనా కేసులు


ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.71 శాతం ఉండగా.. మరణాల రేటు 0.53 శాతం ఉంది. ఇదిలాఉంటే.. రాష్ట్రంలో (Telangana) నిన్న 42,485 కరోనా టెస్టులు చేశారు. వీటితో కలిపి జనవరి 4వ తేదీ వరకు మొత్తం 70,61,049 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా.. హైదరాబాద్ (GHMC) పరిధిలో 61 కేసులు నమోదయ్యాయి.


 Also read: Health Experts: భారత్‌లో హెర్డ్ ఇమ్యూనిటీ.. కొత్త స్ట్రెయిన్‌తో భయం లేదు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook