Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గతంలో నమోదైన కేసులకంటే ప్రస్తుతం రాష్ట్రంలో భారీగా తగ్గుతున్నాయి. నిత్యం 500లకు లోపే కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో (జనవరి 6న) బుధవారం రాత్రి 8గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 379 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా ముగ్గురు (3) ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ (TS Health Ministry) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల (positive cases) సంఖ్య 2,88,789 కి చేరగా.. మరణాల సంఖ్య 1,559 కి పెరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న కరోనా (Coronavirus) నుంచి నిన్న 305 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,82,177 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 5,053 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా (Covid-19) రికవరీ రేటు 97.71 శాతం ఉండగా.. మరణాల రేటు 0.53 శాతం ఉంది. Also read: Agrigold case: అగ్రి గోల్డ్ నిందితులకు 14 రోజుల రిమాండ్


ఇదిలాఉంటే.. రాష్ట్రంలో (Telangana) నిన్న 41,246 కరోనా టెస్టులు చేశారు. వీటితో కలిపి జనవరి 6వ తేదీ వరకు మొత్తం 70,61,049 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా.. హైదరాబాద్ (GHMC) పరిధిలో 71 కేసులు నమోదయ్యాయి.


Also read : Sonu Sood gifts smartphones: ఆచార్య సెట్లో 100 స్మార్ట్ ఫోన్స్ పంపిణీ చేసిన సోనూసూద్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook