Earthquake in Hyderabad |  అసలే భారీ వర్షాలు, వరదలతో చికురుటాకులా వణుకుతున్న హైదరాబాద్ (Hyderabad) ప్రజలను భూప్రకంపనలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. హైదరాబాద్‌లో మళ్లీ భూప్రకంపనలు (Hyderabad Earthquake) ప్రజలను బెంబేలెత్తించాయి. నగరంలోని ఎల్‌బీనగర్ శివారు ప్రాంతాల్లో గురువారం ఉదయం భూ ప్రకంపనలు వచ్చాయి.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువారం ఉదయం 5.40 గంటల సమయంలో బీఎన్‌రెడ్డి నగర్‌, వైదేహీనగర్‌ కాలనీ, ఓంకార్ నగర్ కాలనీలలో వరుస భూప్రకంపనలు (Earthquake) వచ్చాయి. దాదాపు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇలా మూడు పర్యాయాలు స్వల్ప భూప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.



 


ఆ తర్వాత, ఉదయం 6.45 గంటలకు బీఎన్ రెడ్డి నగర్ సమీపంలోని వైదేహీనగర్ కాలనీలో మరోసారి కాస్త శబ్దంతో భూమి కంపించినట్లు సమాచారం. ఆ తర్వాత ఉదయం 7.08 గంటల ప్రాంతంలో మూడోసారి భూప్రకంపనలు వచ్చాయి. ఓవైపు భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ కాలనీలు చెరువులుగా మారిపోయాయని బాధ పడుతుంటే.. వరుస భూప్రకంపనలతో హైదరాబాద్ వాసులు భయాందోళనకు గురయ్యారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe