కరోనా వైరస్ (CoronaVirus)‌పై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతగా వ్యవహరించవద్దంటూ మొన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి ట్వీట్ చేశారు. పార్టీ నేతలు చెప్పడంతో ట్వీట్ డిలీట్ చేసినట్లు సమాచారం. తాజాగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు సరికావన్నారు. ఉనికి కోసమే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, వాటిని పట్టించుకోవద్దని గవర్నర్‌ను కోరారు. Best Interest Rates Banks: అధిక వడ్డీని అందించే బ్యాంకులు ఇవే


బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతోనే తెలంగాణలో కరోనా కట్టడిలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు, రాష్ట్ర హైకోర్టు సైతం కరోనాపై పోరులో తెలంగాణ ప్రభుత్వ తీరును ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు. కొందరు బీజేపీ నేతల ఆరోపణలు, విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరోనాను ఆరోగ్యశ్రీలో ఏమైనా చేర్చారా అని ప్రశ్నించారు. Photos: హాట్ పోజులతో మత్తెక్కిస్తోన్న RGV సెక్సీ హీరోయిన్ 
Roy Hot Stills: బెంగాల్ బ్యూటీ జియా రాయ్ ట్రెండింగ్ ఫొటోలు 
మోడల్, నటి Gunnjan Aras Hot Pics వైరల్