తెలంగాణలో కరోనా కేసులు శరవేగంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డికి కరోనా బారిన పడ్డారు. ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతలకు కోవిడ్19 టెస్టుల్లో పాజిటివ్‌గా తేలగా, కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. బీజేపీ నేత కుటుంబ సభ్యులందరికీ కరోనా పాజిటివ్‌గా తేలడం గమనార్హం. కరోనా పాజిటివ్‌గా తేలినా తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని, ఏ ఆందోళన అక్కర్లేదని పార్టీ శ్రేణులకు సూచించారు.  LockDown5.0పై కడుపుబ్బా నవ్వించే జోక్స్


ప్రస్తుతం కరోనా వైరస్ లక్షణాలతో అపోలో ఆసుపత్రిలో చింతల ఫ్యామిలీ చికిత్స పొందుతోంది. కాగా, తెలంగాణలో ఆదివారం 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఒక్కరోజు కేసుల్లో ఇదే అత్యధికం. రాష్ట్రంలో ఇప్పటివరకూ 2,698 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 82కు చేరంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి