కరీంనగర్‌ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హుజూరాబాద్‌ పట్టణంలో ప్రభుత్వ పథకం మిషన్ భగీరథ ప్రాజెక్టు పరికరాలు ఉంచిన గౌడౌన్‌లో ఈ ప్రమాదం జరిగింది. పరికరాలు ఉన్న గదిలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. కొన్ని నిమిషాల వ్యవధిలో కార్చిచ్చుగా మారి ఆ గౌడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిటనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ అగ్నిప్రమాదంలో మిషన్ భగీరథ ప్రాకెజ్ట్ పరికరాలు దగ్ధమయ్యాయి. వీటి విలువ దాదాపు రూ.2 కోట్ల వరకూ ఉండవచ్చునని ప్రాజెక్ట్ అధికారులు భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. భారీ నష్టాన్ని మిగిల్చిన ఈ అగ్ని ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe