wall collapse: తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా(Gadwal district)లో దారుణం చోటు చేసుకుంది. రాత్రి కురిసిన వర్షానికి పూరి గుడిసె గోడ కూలి(wall collapse) ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. అయిజ మండలం కొత్తపత్తిలో ఓ కుటుంబం పూరి గుడిసెలో నిద్రిస్తుండగా వర్షానికి నానిన గోడ రాత్రి సమయంలో ఒక్కసారిగా కూలింది. దీంతో గోడ పక్కనే నిద్రిస్తున్న కుటుంబ యజమాని మోష, భార్య శాంతమ్మ, పిల్లలు చరణ్, తేజ, రాము అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరో ఇద్దరు పిల్లలు స్నేహ, చిన్న ప్రాణాలతో బైటపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని 108 వాహనంలో కర్నూలులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.


Also read; Heavy rains in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook