Telangana | ​గ్రేటర్ హైదరబాద్ వాసులకు శుభవార్త. త్వరలో ఉచిత మంచినీటి పథకం ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉచిత తాగునీటి పథకాన్ని వినియోగించుకోవాలి అంటే  ఆధార్ కార్డును తప్పని సరి చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Coronavirus Vaccine కోసం Co-WIN యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం


డిసెంబర్ చివరి వారం లేదా జనవరి 2021 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ (Telangana) ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి మున్సిపల్ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ పేరుతో నిన్న అధికారికంగా జీఓ విడుదల చేశారు.


ఉచిత తాగునీటి పథకాన్ని వినియోగించుకోవాలి అనుకుంటున్న వారి వద్ద ఆధార్ కార్డు (Aadhaar Card) లేకపోతే వారు తమ అప్లికేషన్ ఫామ్ చూపిస్తే సరిపోతుంది అని తెలిపారు. వీటితో పాటు ఆలస్యం జరిగితే ఓటర్ ఐడీ కార్డు, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్, పాన్ కార్డు, పోస్టాఫిస్ పాస్‌‌బుక్ ఏదోటి చూపించాలి అని తెలిపారు.



Also Read | PM Awas Yojana: అప్లై చేసే సమయంలో ఈ తప్పులు చేస్తే సబ్సిడీ అస్సలు రాదు, వెంటనే చదవండి


వాస్తవానికి హైదరాబాద్‌లో మొత్తం నీటి కనెక్షన్స్‌లో 3వ వంతు మీటర్లు లేవు. కొత్తగా ఈ పథకం అమలులోకి వస్తే అందరూ మీటర్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook