హైదరాబాద్ మెట్రో ( Hyderabad ) భాగ్యనగరవాసులకు శుభవార్త తెలిపింది. దసరా పండగను పురస్కరించుకుని మెట్రోలో ప్రయాణించే వారికి డిస్కౌంట్ ప్రకటించింది. దసరా పండగ రాయితీ గురించి హైదరాబాద్ మెట్రో ( Hyderabad Metro ) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటన ప్రకారం మెట్రో సువర్ణ ఆఫర్ లో భాగంగా ప్రయాణికులకు 40 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించనున్నారట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


READ ALSO: POCO M2:  ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో POCO M2


ఈ డిస్కౌంట్ ను స్మార్ట్ కార్డు, ట్రిప్ కార్డుల ద్వారా ప్రయాణికులు పొందే అవకాశం ఉంది. మెట్రో సువర్ణ ( Metro Suvarna By Hyderabad Metro ) రాయితీలను అక్టోబర్ 17వ తేదీ నుంచి 2021లో సంక్రాంతి వరకు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇక ట్రిప్ కార్డు ఉన్నవారికి రెండు నెలల డిస్కౌంట్ ప్రకటించారు.


గర్భిణీ కోసం ప్రత్యేక రైలు...
ఇటీవలే కురిసిన భారీ వర్షాలతో పాటు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీటీ వల్ల భాగ్యనరంలో వరదలు పోటెత్తాయి. రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. దీంతో అత్యవసర సేవలకు ఆటంకం కలిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఒక గర్భిణీ కోసం మెట్రో స్పెషల్ ట్రైన్ నడిపినట్టు ఎన్వీరెడ్డి తెలిపారు. వరద వల్ల రోడ్లు డ్యామేజ్ అవడంతో కొంత కాతం మెట్రో ప్రయాణానాన్ని ప్రోత్సాహించడానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.


READ ALSO: Navratri 2020: అమ్మవారికి ఏ రోజు ఎలాంటి పూజలు జరగాలి ? ఘటస్తాపన ముహూర్తాలు ఏంటి ?


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR