తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో గడపాలని కోరుంటున్నట్లు చెప్పారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ గవర్నర్  ఇ.ఎస్.ఎల్. నరసింహన్ మాట్లాడుతూ-  "తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో గడపాలని.. వారి కుటుంబాల్లో చిరునవ్వులు చిగురించాలని కోరుకుంటున్నా" అని ఒక ప్రకటనలో తెలిపారు. 


ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ- "కొత్త సంవత్సరంలో ప్రజలంతా సఖసంతోషాలతో గడపాలని కోరుకుంటూ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాలన్నీ 2018 సంవత్సరంలో కూడా విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ.. రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు" అని తెలిపారు.