Gunfire in siddipeta: సిద్దిపేట జిల్లాలో (siddipeta district) మరోసారి కాల్పుల కలకలం రేగింది. తొగుట మండలం రాంపూర్‌ శివారులో ఒగ్గు తిరుపతి అనుచరులు ఆకుల వంశీపై కాల్పులకు తెగబడ్డారు. గతంలో వంశీకృష్ణ ఒగ్గు తిరుపతి పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. దుబ్బాక మండలం చెల్లాపూర్‌కు చెందిన ఈ ఇద్దరి మధ్య భూ వివాదం (Land Dispute) కారణంగా పరస్పరం కాల్పులు జరుపుకొన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి దుబ్బాక కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వంశీ దుబ్బాక కోర్టుకు హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో రాంపూర్‌ శివారులో అతనిపై తిరుపతి అనుచరులు కాల్పులు జరిపారు. వీరిద్దరూ సమీప బంధువులేనని, పాత కక్షలు, భూవివాదాల నేపథ్యంలోనే కాల్పుల జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే తిరుపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. సీపీ శ్వేత ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Also Read: Srinivas Goud: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ హత్య కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం.. నిందితులను కస్టడీకి తీసుకున్న పోలీసులు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook