కరోనా వ్యాప్తి సమయంలో జర్నలిస్టుల ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఓవైపు రెగ్యూలర్ అనారోగ్య సమస్యలతో కొందరు సతమతమవుతుంటే.. మరోవైపు వార్తల రిపోర్టింగ్‌కు వెళ్లి కొందరు జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో సీనియర్ జర్నలిస్ట్ రాజా అక్కలదేవి అనారోగ్యంతో మృతిచెందాడు. ఆంధ్రజ్యోతి మహబూబ్​నగర్ యూనిట్​ కార్యాలయంలో సబ్​ఎడిటర్‌గా రాజా విధులు నిర్వహిస్తున్నాడు. COVID19 నుంచి కోలుకున్న భారత అరుదైన క్రికెటర్


గత కొంతకాలంగా క్యాన్సర్‌ మహమ్మారితో పోరాడుతున్న రాజా తనువు చాలించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా వాసి అయిన రాజా.. నమస్తే తెలంగాణ, సాక్షి దినపత్రికల్లోనూ సబ్​ఎడిటర్‌గా సేవలందించాడు. సీనియర్ జర్నలిస్ట్ రాజా మరణంపై జర్నలిస్ట్ సంఘాలు సంతాపం ప్రకటించాయి. రాజా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపాయి. Telangana: ఒకే ఇంట్లో నలుగురు మృతి.. క్షుద్ర పూజలే కారణమా..?