హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో 281 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసినట్లు సంస్థ కార్య నిర్వాహణాధికారి డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ తెలిపారు. మొత్తం 12 సబ్జెక్టులకుగాను జూనియర్ లెక్చరర్లను ఎంపిక చేసినట్లు నవీన్ నికోలస్ వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు నికోలస్ పేర్కొన్నారు. ఈ మేరకు నికోలస్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.