భారత ప్రధాని మోడీని అమర్యాదగా సంబోధించారనే  ఆరోపణలపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. హైదరాబాద్ లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎప్పుడు మోడీని గాడు అని సంబోధించలేదని..ఇది కేవలం వక్రీకరణ మాత్రమేనన్నారు. మోడీకి గారు అని సంబోధిస్తే. దాన్ని మోడీ గాడు అన్నట్లు క్రీయేట్ చేశారని ఆరోపించారు. తనకు మోడీతో ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని..అయితే తన ద్వేషమంతా ఈ వ్యవస్థపైనేనని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా మోడీ విషయంలో తాను ఎప్పుడు తప్పు మాట్లాడలేదని..తన మాటలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. తాను మాట్లడిన సందర్భం చూస్తే ఎవరికైనా ఈ విషయం అర్థమతుందాని పేర్కొన్నారు. తను మాట్లాడే భాషలో తెలంగాణ యాస , ప్రాంతీయత ఉంటుందని..అందుకే అలా భావించి ఉంటారని కేసీఆర్ వివరణ ఇచ్చారు.