హైదరాబాద్: నగరంలోని భర్కత్ పురాలోని సత్యనగర్ కాలనీకి చెందిన మధులిక ఇంటర్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన భరత్ అనే పోకిరి తనను ప్రేమించాలని కొన్ని రోజులుగా వేదిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు విద్యార్ధిని అడ్డుకొని తనను ప్రేమించాలని కోరాడు అందుకు నిరాకరించడంతో కత్తితో దాడి చేశాడు.  .కాగా ఈ దాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది. రక్తపు మడుగులో ఉన్న బాలికను సమీపంలోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిందితుడి కోసం గాలింపు చర్యలు..


దాడి సమచారం అందుకున్న పోలీసులు..ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితుడి పట్టుకునేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఓ పోలిస్ అధికారి మాట్లాడుతూ నిందితుడు భరత్ కు 19 ఏళ్లు.. ఉంటాయని గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు తెలుస్తోందన్నారు. కాగా...ఇటీవలెకాలంలో వీరిద్దరి మధ్య మాటలు లేకపోవడం.. ఉద్వేగానికి గురై ఆ యువకుడు దాడికి పాల్పడ్డాని పేర్కొన్నారు. అయితే పూర్తి స్థాయి విచారణ జరపాల్సి ఉందన్నారు.


గతంలోనూ ఓ సారి వేధింపులు


తనను వేదిస్తున్నాడంటూ భరత్ పై బాధితురాలు గతంలో ఫిర్యాదు చేసింది.ఈ క్రమంలో భరత్ కు కౌన్సెలింగ్ ఇచ్చి పోలీసులు వదిలేశారు. అప్పటి నుంచి కసి పెంచుకున్న భారత్ ఈ మేరకు దాడికి పాల్పడినట్లు తెలిస్తోంది.


దాడిని ఎవరూ అడ్డుకోలేదు..


దాడి జరిగిన సమయంలో మధలికతో పాటు వాళ్ల అక్క మౌనిక, పన్ని రాజేశ్వరి ఉన్నారు. మధులిక అరుపులు విని పరుగులు పెట్టామన్నారు. కాగా మధలికను కత్తితో నరుకుతుంటే ఎవరూ స్థానికలెవరూ అడ్డుకోలేదని  మధులిక అక్క మౌనిక, పిన్ని రాజేశ్వరి మీడియా ముందు వాపోయారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు స్పందిస్తూ తన కూతరిపై దాడికి పాల్పడిన యువకుడిని ఏ మాత్రం వదలిపెట్టవద్దని పేర్కొన్నారు