Mallu Ravi Warning: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన 'మన ఊరు-మన పోరు' కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి పాల్గొని ప్రసంగించారు. సభలో మల్లు రవి మాట్లాడుతున్న సమయంలో కొంత డిస్టర్బెన్స్ జరగడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రేయ్ రేయ్.. ఏమి పిచ్చా..? ఎవడ్రా అక్కడ..? ఏయ్ ఎవడు గడ్డం వాడు కూర్చుండు? ఏం చేస్తున్నారు..? ఎందుకలా టికటిక కొడుతున్నారు మాట్లాడుతుంటే..' అంటూ ఫైర్ అయ్యారు. వెంటనే పక్కనే ఉన్న సిబ్బంది వచ్చి.. మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ టెస్టింగ్ అని చెప్పారు. దీంతో శాంతించిన మల్లు రవి తన ప్రసంగాన్ని కొనసాగించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్థానిక సమస్యలపై గళమెత్తుందుకు కాంగ్రెస్ పార్టీ మన ఊరు మన పోరు కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా కొల్లాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేసింది. కాంగ్రెస్ కీలక నేతలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరికి మద్దతు ధర, ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి నిర్వాసితులు, శ్రీశైలం ముంపు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వడంలో జరిగిన జాప్యం తదితర అంశాలను ఈ సభలో రేవంత్ ప్రస్తావించనున్నారు.


Also Read: Radhe Shyam Collection: రాధే శ్యామ్​ 2 రోజుల్లో రూ.119 కోట్ల వసూళ్లు- మూడో రోజు?


Also read: Radheshyam Collections: ప్రభాస్ ఫస్ట్ డే కలెక్షన్ లలో పుష్ప, భీమ్లానాయక్‌ లను దాటేసాడా..??


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook