Man enters lion enclosure in hyderabad Zoo Park: హైదరాబాద్​ నెహ్రూ జూపార్క్‌(hyderabad Zoo Park)లో యువకుడు హల్‌ చల్‌ చేశాడు. సాయికుమార్‌ అనే యువకుడు ఆఫ్రికన్‌ జాతికి చెందిన సింహాలు ఉండే ఎన్‌క్లోజర్‌(Lion enclosure) దగ్గరికి వెళ్లాడు. సమీపంలోని బండ రాళ్లపై కూర్చున్నాడు.  ఈరోజు మధ్యాహ్నం 3.30గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూ పార్క్‌లోని నిషేధిత ప్రాంతంలోకి వెళ్లిన సాయికుమార్‌ అక్కడ బండరాయిపై కూర్చొని ఉండగా సింహం(Lion) కూడా అతని సమీపంలోకి వచ్చింది. పొరపాటున అతను రాయిపై నుంచి జారిపడి ఉంటే సింహం దాడి చేసి ఉండేదని  సందర్శకులు తెలిపారు. అక్కడి నుంచి బయటకు రావాలని సందర్శకులు కేకలు వేసినా ఆ యువకుడు పట్టించుకోలేదు. 


Also Read: భర్తకు మద్యం తాగించి భార్యపై హత్యాచారం


ఓ వైపు కేర్ టేకర్(Care Taker) కూడా సింహాం దృష్టి మరల్చేలా ప్రయత్నించాడు. వెంటనే జూపార్క్‌ సిబ్బంది అప్రమత్తమై యువకుడిని కాపాడి బయటకు తీసుకొచ్చారు. అతన్ని బహదూర్‌పురా పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు(Police) సాయికుమార్‌కు మతి స్థిమితం లేదని గుర్తించారు. యువకుడిని కీసరకు చెందిన సాయి కుమార్​గా పోలీసులు గుర్తించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook