Mulugu Road Accident: ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో-డీసీఎం వ్యాను ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ములుగు జిల్లాలోని ఇంచర్ల ఎర్రిగట్టమ్మ వద్ద శుక్రవారం (మార్చి 4) రాత్రి ఈ ప్రమాదం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మృతులను అజయ్ (12), కిరణ్ (16), జానీ (23), వసంతగా గుర్తించారు. మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన వీరు.. ఆటోలో అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లి తిరిగొస్తున్నట్లు గుర్తించారు. మరికాసేపట్లో ఇంటికి చేరుతారనగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు.


ఇదే ములుగు జిల్లాలోని గట్టమ్మ ఆలయం వద్ద గత నెలలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. మేడారం జాతరకు వెళ్లే మార్గంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలవగా ములుగు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులను వాజేడు మండలం ధర్మారానికి చెందిన సుజాత, శ్రీనివాస్, రమేశ్, జ్యోతిగా గుర్తించారు. 


Also Read: Horoscope Today March 5 2022: రాశి ఫలాలు.. వివాహ విషయంలో ఆ రాశి వారికి కీలక సూచన..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook