Nagarkurnool Road Accident: ఉగాది పండుగ పూట నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోదాడ-జడ్చర్ల హైవేపై చారకొండ మండలంలోని తుర్కలపల్లి గ్రామ సమీపంలో ఓ కారు బోల్తా పడింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డుపై బోల్తా కొట్టింది. శనివారం (ఏప్రిల్ 2) ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వెల్లడించారు.


మృతులను గౌస్ ఖాన్ (55), సాదిక్ (55), ఫర్హానా (45), రౌషన్ (24)గా పోలీసులు గుర్తించారు. వీరంతా ఏపీలోని కడప జిల్లా నుంచి తెలంగాణలో ఉన్న సూర్యాపేటలోని స్వగ్రామం నేరేడుచర్ల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 


నెల క్రితం ఇదే నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. స్నేహితుడి వివాహానికి వెళ్లి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో కిరణ్మయి (22), శిరీష (20), అరవింద్ (23) అనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 


Also Read: Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి గుండెపోటుతో మృతి!


SRH Kane Williamson: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ నిరసన.. బీసీసీఐ వద్దకు చేరిన కేన్‌ 'క్యాచ్‌' పంచాయతీ!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.