New Assmembly:తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని భావిస్తోంది రేవంత్‌ రెడ్డి సర్కారు. తెలంగాణ రాజసం ఉట్టిపడేలా ఈ నిర్మాణం వుండాలని భావిస్తోంది. ఇప్పటికే గత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ పాలనా వ్యవస్థలపై తనదైన ముద్ర వేసారు. హైదరాబాద్ రూపు రేఖలు మార్చారు. దాదాపు హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫ్లై వోవర్లు.. అండర్ పాస్ లతో పాటు.. కాళేశ్వరం, మల్లన్న సాగర్ తో పాటు పలు తెలంగాణలో పలు జిల్లాల రూపు రేఖలు మార్చివేసారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు ఒకపుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్.. ఆ తర్వాత తెలంగాణ సెక్రటేరియట్ భవవాన్ని వాస్తు బాగోలేదంటూ  కూల్చి వేసి రాజసం ఉట్టి పడేలా కొత్త భవనాన్ని నిర్మించారు.   మరోవైపు మహిళల భద్రత కోసం షీ టీమ్స్, మెడికల్ హబ్ లతో  పాటు..  మెట్రో ప్రాజెక్ట్ ఇలా హైదరాబాద్ హైదరాబాద్ పై తనదైన ముద్ర వేసారు కేసీఆర్.ఇపుడు కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు.


చంద్రబాబు అప్పట్లో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్  నిర్మించి హైదరాబాద్ నగరంలో ఐటీకి కొత్త బాటలు వేసారు. ఇపుడు రేవంత్ సర్కారు.. శంషాబాద్ ఆవలా ఫోర్త్ సిటీకి రంగం సిద్ధం చేస్తున్నారు. హైడ్రాతో నగరంలో కనుమరుగైన చెరువులను, కుంటలను కాపాడేందుకు నడుం బిగించారు. మరోవైపు మెట్రో విస్తరణ పనులు చేపట్టి నగరంపై తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న జూపార్క్ ను తరలించడంతో పాటు.. దామగుండంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు వంటి పనులతో తనదైన ముద్ర వేస పనిలో పడ్డారు రేవంత్ రెడ్డి.


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


అదే తరహాలో  తెలంగాణ కొత్త పార్లమెంట్ భవనం తరహాలోనే పెరిగే శాసన సభ సీట్ల నేపథ్యంలో  కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించే పనిలో రేవంత్ సర్కారు అడుగులు వేస్తోంది.   ఈ మేరకు తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రకటించారు. నిజాం నిర్మించిన భవనం తరహాలోనే.. రాజసం ఉట్టిపడేలా అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్టు పేర్కొన్నారు. ఈ పునర్నిర్మాణ పనులు 3 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు.


ముఖ్యంగా పార్లమెంట్ సెంట్రల్ తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు ఒకే దగ్గర ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం.. అసెంబ్లీ నుంచి కౌన్సిల్‌కు వెళ్లాలంటే.. వాహనాలు ఉపయోగించక తప్పడం లేదని చెప్పుకొచ్చారు. రెండు భవనాలు ఒకే దగ్గర ఉంటే సమయం ఆదా అవుతుందని అభిప్రాయపడ్డారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter