SRSP Dam Water: తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌ను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం సందర్శించారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్లో ఎగువ ప్రాంతం నుండి వచ్చి చేరిన గోదావరి వరద జలాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని నీరు రంగు మారి కలుషితం అయ్యిందనే ప్రచారం నెలకొంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోని గోదావరి జలాలు కలుషితం అయ్యాయనే ప్రచారంతో మిషన్ భగీరథ పథకం కింద శ్రీరాంసాగర్ నీటి సరఫరా అయ్యే ప్రాంతాల వాసులతో పాటు ఆయకట్టు రైతుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టులోని నిలువ నీటిని స్వయంగా పరిశీలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా డ్యాం సైట్‌పైనే సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తాజా పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. " రిజర్వాయర్‌లోని నీరు పచ్చ రంగులో మారినప్పటికీ, ఎలాంటి హానికరమైన వ్యర్ధాలు కలవలేదని, ప్రాజెక్టు జలాలు కలుషితం కాలేదు " అని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. మిషన్ భగీరథ కింద తాగు నీటి కోసం వినియోగించే సుమారు 10 ఇంటెక్ వెల్ పాయింట్ల వద్ద నుండి గోదావరి జలాల శాంపిల్స్ సేకరించి అవసరమైన పరీక్షలు నిర్వహించగా, వినియోగానికి అనువైనవిగానే ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. 


ఎస్సారెస్పీ ప్రాజెక్టుతో పాటు బాసర, యంచ తదితర ప్రాంతాల వద్ద నుండి కూడా శాంపిల్స్ సేకరించి ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా, జలాలు కలుషితం కాలేదని వెల్లడైందని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీ జలాలను తాగునీటి అవసరాలతో పాటు పంటల సాగుకు వినియోగించినప్పటికీ, ఎలాంటి హాని ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ నీటి శాంపిల్స్‌ను మరోమారు సేకరించి సమగ్ర పరీక్షల కోసం సంగారెడ్డిలోని ల్యాబ్‌కు పంపించాలని కలెక్టర్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. 


ఇది కూడా చదవండి : Tummala Nageshwar Rao: తుమ్మలతో మల్లు భట్టి విక్రమార్క భేటీ..


శ్రీరాం సాగర్ డ్యామ్ వద్ద నీటి పరిశీలన అనంతరం కలెక్టర్  రాజీవ్ గాంధీ హనుమంతు మీడియాతో మాట్లాడుతూ, " ఎస్సారెస్పీ నీటి స్వచ్ఛత విషయమై పలు పత్రికలలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రాజెక్టును సందర్శించి పరిస్థితిని సమీక్షించడం జరిగిందన్నారు. ఆయకట్టు రైతులు, ప్రజల నుండి ఎస్సారెస్పీ నీటి విషయంలో ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, ఎక్కడ కూడా ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదని తెలిపారు. జలాలు కలుషితం కాలేదని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు నిర్వహించిన పరీక్షల్లోనూ వెల్లడైంది " అని అన్నారు. ప్రజలు, ఆయకట్టు రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కలెక్టర్ సూచించారు. అయినప్పటికీ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిలో ఆక్సిజన్ శాతం తదితర ప్రమాణాలను పరిశీలించేందుకు వీలుగా కాలుష్య నియంత్రణ మండలి ద్వారా సమగ్ర పరీక్షలు జరిపించాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెంట ఎస్సారెస్పీ ఎస్.ఈ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.


ఇది కూడా చదవండి : Yennam Srinivas Reddy Suspended: యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసిన బీజేపి.. ఎందుకంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి