Fan Who Tripled On Six Guarantee: తెలంగాణ సీఎంగా రేవంత్‌ రెడ్డి పదవిని చేపట్టిన అప్పటి నుంచి ఆయన ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు. ముఖ్యంగా మహిళల కోసం సీఎం రేవంత్‌ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల స్కీం సక్సెస్‌ తర్వాత ఆయనకు చాలా మంది వీరాభిమానులు అయ్యారని చెప్పవచ్చు. ఈ తరుణంలోనే ఓ అభిమాని సీఎం రేవంత్ రెడ్డి పై ఉన్న  అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకుంది. ఇంతకు ఆ అభిమాని ఏం చేసిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జగిత్యాల జిల్లా పెగపడపల్లి మండలం వెంగలాయపేటకు చెందిన సుమలత తన సృజనాత్మకతతో ఔరా అనిపించుకుంది.  తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లపై  తనకున్న అభిమానాన్ని  సృజనాత్మకత ద్వారా ప్రదర్శించారు.  సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు అందరూ వివిధ రీతిలో ముగ్గులు వేడయం జరగుతుంది. అయితే సుమలత మాత్రం చాలా డిఫరెంట్‌గా ఆలోచించారు.  


ఇంటి ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరుఎ గ్యారెంటీల పథకాలను వివరిస్తూ ముగ్గును గీశారు. ఈ ముగ్గు పది మందికి అర్థం కావాలని ఆమె ఈ ముగ్గు గీసారని తెలుస్తోంది. అంతేకాకుండా సుమలత ముగ్గు చుట్టూ  జై కాంగ్రెస్, జై  రేవంత్ రెడ్డి, జై అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అని రాశారు. సంక్రాంతి రోజున రథం ముగ్గు, పొంగల్ ముగ్గు వేయకుండా చాలా సృజనాత్మకతతో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల స్కీంలను వివరిస్తూ వేసిన ఈ ముగ్గు పలువురిని ఆకట్టుకుందని చెప్పావచ్చు.  ఈ ముగ్గు కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.


Also Read: MLC Elections 2024: రెండు ఎమ్మెల్సీ సీట్లు.. 12 మంది పోటీ.. ఆ లక్కీ ఛాన్స్ ఎవరికో..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook