Jadcherla Road Accident: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఏడుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే... తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తోన్న ఆర్టీసీ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. బస్సు ముందు భాగంలో ఇరుక్కుపోయిన డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. జడ్చర్ల పరిధిలోని చిట్టి బోయిన్‌పల్లి గ్రామ సమీపంలో గురువారం (జనవరి 13) తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.


రాత్రి వర్షం కురవడం... రోడ్డుపై పొగమంచు కమ్ముకోవడంతో ఆర్టీసీ డ్రైవర్ ఎదురుగా వెళ్తున్న వాహనాన్ని గమనించలేకపోయినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. వారం రోజుల క్రితం ఇదే జడ్చర్ల పరిధిలోని పోలేపల్లి శివారులో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో (Road Accident) మోహన్ రాజ్ (33) అనే యువకుడు మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న అతను.. ముందు వెళ్తున్న కారును ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
 


Also Read: Today Horoscope January 13 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!!


Also Read: Vaikunta Ekadasi 2022: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ద్వార దర్శనం.. ఉపవాస సమయ, నియమాలు ఇవే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి