Telangana Traffic Lok Adalat: వాహనాల పెండింగ్ చలాన్ల చెల్లింపునకు తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన ఈ-లోక్ అదాలత్‌కు భారీ స్పందన లభిస్తోంది. తొలి రోజే (మార్చి 1) రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది వాహనదారులు పెండింగ్ చలాన్లు చెల్లించారు. నిమిషానికి 700 చలాన్ల చొప్పున చెల్లింపులు జరిగినట్లు తెలుస్తోంది. తద్వారా తొలి రోజు ప్రభుత్వానికి రూ.5.50 కోట్ల ఆదాయం సమకూరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెండింగ్ చలాన్ల చెల్లింపు జరిపే వెబ్‌సైట్‌కి ఒక్కసారిగా ట్రాఫిక్ పోటెత్తడంతో సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు సమాచారం. పేమెంట్ గేట్ వే వద్ద సమస్య తలెత్తుతోందని వాహనదారులు వాపోతున్నారు. వెబ్‌సైట్ సామర్థ్యం పెంచేలా సాంకేతిక మార్పులు చేపట్టినప్పటికీ ఈ సమస్య తలెత్తుతోంది. మార్చి 31 వరకు ఈ లోక్ అదాలత్ కొనసాగనుండటంతో ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరే అవకాశం ఉంది.


వాహనాలపై పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. ద్విచక్ర వాహనాలకు 75 శాతం, కార్లకు 50 శాతం, బస్సులకు 30 శాతం రాయితీని ప్రకటించారు. మిగతా మొత్తాన్ని మాఫీ చేస్తున్నారు. దీంతో పెండింగ్ చలాన్ల చెల్లింపుకు వాహనదారులు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి రోజే భారీ ఎత్తున చెల్లింపులు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 30 వరకు వాహనదారులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. https://echallan.tspolice.gov.in/publicview/ వెబ్‌సైట్‌తో పాటు డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా పెండింగ్ చలాన్ల చెల్లింపులు జరపవచ్చు.


Also Read: Amritsar Samosa Vendor: ఈ సమోసా అంకుల్‌ గొప్పతనానికి జనం ఫిదా..


Also Read: Adipurush Release Date: ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook