President Ram Nath: భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఈ నెల నాలుగో వారంలో హైదరాబాద్​కు రానున్నారు. శీతాకాల విడిదిలో (President`s winter sojourn) భాగంగా ఐదు రోజులు హైదరాబాద్​లో సతీ సమేతంగా బస చేయనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రపతి రాక నేపథ్యంలో.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆక్టోపస్​ టీమ్ ఇప్పటికే మాక్​ డ్రిల్స్ నిర్వహిస్తోంది.


ఇదే చివరి విడిది?


రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు హైదరాబాద్ శీతాకాల విడిది ఇదే చివరిది కానుంది. ఎందుకంటే వచ్చే ఏడాది జులైలో రామ్​నాథ్​ కోవింద్​ పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రపతి (President Ram Nath to Hyderabd) రాకకోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది.


రాష్ట్రపతి ప్రతి ఏటా శీతాకాలంలో హైదరాబాద్​లోని రాష్ట్రపతి భవన్​లో బస చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ఆయన ఈ నెలలో హైదరాబాద్​కు రానున్నారు. అయితే కొవిడ్ కారణంగా గత ఏడాది రాష్ట్రపతి హైదాబాద్​కు రాలేదు. రాష్ట్రపతి రాక తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలన్నీ భద్రతా దళాల నిఘాలో ఉంటాయి.


రాష్ట్రపతి రాక ఇలా..


ప్రత్యేక విమానంలో ఢీల్లీ నుంచి బయల్దేరీ హైదరాబాద్​ డిండిగల్​ విమాానాశ్రయానికి రానున్నారు రామ్​నాథ్ కోవింద్. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్​లో బొల్లారం చేరుకోనున్నారు. 4-5 రోజుల పాటు అక్కడే బస చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభమైంది.


Also read: Driving license to dwarf: హైదరాబాద్​ మరగుజ్జుకు డ్రైవింగ్ లైసెన్స్​- దేశంలోనే తొలిసారి!


Also read: Shilpa Chowdary : శిల్ప చౌదరి కేసులో కొత్త కోణం, రాధికకు డబ్బులు ఇవ్వడంతోనే మోసపోయిందట


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook