హైదరాబాద్: వేసవి వేడి, మండుటెండల నుంచి కొంత ఉపశమనం కలిగిస్తూ హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం పలు చోట్ల వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, జూభ్లీహిల్స్‌, మాదాపూర్‌, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. వర్షం కురవని ప్రాంతాల్లోనూ చల్లటి గాలులు వీయడంతో ఉక్కపోత నుంచి నగరవాసులకు కొంత ఉపశమనం లభించింది. 


నేటి నుంచి రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూడు రోజులైనా ఎండ వేడి నుంచి బయటపడొచ్చని నగరవాసులు ఆశిస్తున్నారు.