ఆదిలాబాద్ జిల్లా అందోలి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అడవి పంది అడ్డురావడంతో తుఫాను వాహనం బోల్తాపడి ముగ్గురు మరణించారు. అకస్మాత్తుగాఅడవిపంది అడ్డురావడంతో డ్రైవర్ దీనిని తప్పించబోవడంతో వాహనం అదుపు తప్పడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. బాధితులందరూ కుమురంభీం జిల్లా జంగావ్ గ్రామానికి చెందినవారు. మహారాష్ట్రలోని కిన్వట్‌లో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.