సీబీఐ మాజీ జేడీ, ప్రస్తుతం మహారాష్ట్రలో అదనపు డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మినారాయణ ఇంట్లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో ఆయన నివాసంలో బంగారు ఆభరణాలు భారీగా చోరీకి గురయ్యాయి. ఈమేరకు ఆయన కుటుంబసభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం ఉదయం కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఇంట్లో పనిచేసే వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.