ఓవైపు హైదరాబాద్ నగరం హోలీ వేడుకల్లో నిమగ్నమైవుండగానే మరోవైపు.. పాత బస్తీ పరిధిలోని బీబీకాచెష్మాలో రౌడీషీటర్‌కి ఇతర వ్యక్తులకు మధ్య కొనసాగాతున్న పాత విభేదాలు ఆ రౌడీషీటర్ ప్రాణాలుతీసేలా చేశాయి. రౌడీషీటర్ ఈసాపై జావేద్, నవీన్ అనే ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఈసాను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే అతడు మృతిచెందాడు. గతంలో జరిగిన ఓ హత్య కేసులో ఈసా నిందితుడిగా వున్నాడు. ఈసా హత్య ఘటనపై కేసు నమోదు చేసిన ఫలక్‌నుమా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


తమ అన్న భార్యను రౌడీ షీటర్ ఈసా పెళ్లి చేసుకున్నాడనే ఆగ్రహంతోనే జావేద్, నవీన్ ఈ హత్యకు పాల్పడినట్టుగా సమాచారం అందుతోంది.