స్కూలుకు వెళ్తున్న ఆ చిన్నారుల పాలిట ఆ  లారీ మృత్యు శకటంలా కబలించింది. హృదయ విదారకమైన ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో జరిగింది. రోజులాగే యధావిధిగా ఆటోలో స్కూలు వెళ్తున్న ఆ విద్యార్థి  .. ఇంకా పాఠశాలకు చేరుకోక ముందే అనంత లోకాలకు పయనమయ్యాడు. హైదరాబాద్ ఉప్పల్  ప్రాంతంలోని  లిటిల్ ఫ్లవర్ కాలేజీ వద్ద స్కూల్ ఆటోను ఓ ఇసుక లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. లారీ బలంగా  ఢీకొట్టడంతో .. ఆటో పల్టీలు కొడుతూ పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు విద్యార్థులు, ఆటో డ్రైవర్ పక్కకు పడిపోవడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. ఐతే వారికి గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఇసుక లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు 
తమ పిల్లాడు స్కూలుకు వెళ్లారని ..  నిశ్చింతగా ఉన్న తల్లిదండ్రులు .. అంతలోనే అతని మరణ వార్తను వినాల్సి వచ్చింది. చిన్నారి తల్లిదండ్రులు అతని మృతిపట్ల కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి ఆక్రందనలు స్థానికులకు కూడా కంట నీరు తెప్పించింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..