Sharmila on CM Kcr: సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. వారం రోజుల వానల తర్వాత దొరకు ఇవాళ తీరిక దొరికిందని..వరద ప్రాంత ప్రజలను చూసేందుకు గడి నుంచి అడుగు పెట్టారని విమర్శించారు. హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే చేసి.. తీరా తెలంగాణపై విదేశీ కుట్ర జరుగుతుందని సెలవిచ్చారని మండిపడ్డారు. వానలు, వరదలు రావడానికి క్లౌడ్ బరస్ట్ అని కాకమ్మ కథ చెబుతున్నారన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేసీఆర్ తీరు చూస్తుంటే బోడి గుండుకు మోకాళ్లకు ముడేసినట్లు ఉందని విమర్శించారు. విదేశీ కుట్రలపై సారుకు సమాచారం ఉందా అని ప్రశ్నించారు. వరద నష్టంపై ఎంత సమాచారం వచ్చిందో చెప్పాలన్నారు. లక్షల్లో ఆస్తి నష్టోయి..గూడు, తిండి లేక ఇబ్బందులు పడుతున్న బాధితులకు సాయం చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. జీహెచ్‌ఎంసీలో వరద సాయాన్ని గులాబీ లీడర్లే మింగేశారని..అలాంటి పరిస్థితి ఇక్కడ రాకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Also read:Margaret Alva: జగదీప్‌ ధన్‌ఖడ్‌ను ఢీకొట్టనున్న మార్గరెట్ అల్వా..ఇంతకు ఎవరీ మహిళ..?


Also read:CICSE 10th Class Results: ఐసీఎస్‌ఈ 'పది' ఫలితాలు విడుదల..రిజల్ట్ ఇలా చూసుకోండి..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.