Road Accident - six persons died: హైదరాబాద్‌: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) సంభవించింది. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల (chevella ) లో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చేవెళ్లలోని హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారిపై బుధవారం ఇన్నోవా కారు - బోర్‌వెల్‌ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరేళ్ల చిన్నారితో సహా ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా హైదరాబాద్ తాడ్‌బండ్ వాసులుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 10 మంది ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Burevi cyclone live updates: మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఐఎండీ హెచ్చరిక


సికింద్రాబాద్ ( Hyderabad ) తాడ్‌బండ్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వెళ్తున్న ఇన్నోవా కారు ఎదురుగా వస్తున్న బోర్‌వెల్‌ వాహనం చేవెళ్ల మండలం కందవాడ-మల్కాపూర్‌ శివారులో ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతులు సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్‌కు చెందిన అసిఫ్‌ఖాన్‌, సానియా, నజియాబేగం, హర్ష, నజియాభాను, హర్షభానుగా గుర్తించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Also read: Farmer protests: కొలిక్కిరాని చర్చలు.. రేపు మరోసారి కేంద్రంతో భేటీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe