TS Cabinet meeting points to know: హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అని భేటీకి ముందు నెలకొన్న పలు సందేహాల్లో కొన్నింటికి సమాధానం లభించింది. లాక్‌డౌన్ పొడిగింపు, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు, పెన్షనర్లకు బకాయిలు చెల్లింపు, నిరుపేదలకు కొత్త రేషన్ కార్డుల జారీ, రేషన్ డీలర్ల డిమాండ్ల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు, రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటుతో పాటు పలు ఇతర కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాక్‌డౌన్ పొడిగిస్తారా లేదా అనే ప్రశ్నలకు ఫుల్‌స్టాప్ పెడుతూ లాక్‌డౌన్ సమయాల్లో సడలింపులతో కూడిన మార్పులుచేర్పులు చేసి తెలంగాణ సర్కారు అన్‌లాక్ దిశగా అడుగులేసింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వారికి తీపి కబురు చెప్పింది. పెన్షనర్లకు గతేడాది ఏప్రిల్ నుంచి పెండింగులో ఉన్న బకాయిలను వాయిదాల్లో చెల్లించేందుకు అంగీకరించింది. అన్నింటికంటే నిరుపేదలు ఎప్పటి నుంచో వేచిచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వారికి కూడా గుడ్ న్యూస్ చెప్పింది.


Telangana lockdown timings: తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు.. లాక్‌డౌన్ కొత్త టైమింగ్స్ 


Lockdown in telangana extended: తెలంగాణలో జూన్ 10 నుంచి లాక్‌డౌన్ మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి సమాచారం కోసం Read more...


New ration cards applications: కొత్త రేషన్ కార్డులు మంజూరు, రేషన్ డీలర్ల డిమాండ్స్‌, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటుపై ప్రకటన


తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు మంజూరు చేస్తారా అని ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ సర్కారు ఎట్టకేలకు గుడ్ న్యూస్ (Good news) చెప్పింది. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించుకుంది. మంగళవారం సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో లాక్‌డౌన్ పొడిగింపుతో పాటు పలు ఇతర అంశాలపై కూడా చర్చించిన కేబినెట్.. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై సానుకూల నిర్ణయం తీసుకుంది. పూర్తి సమాచారం కోసం Read more...


PRC approved: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు Good news.. వేతనాల పెంపు, పీఆర్సీ అమలుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలుకు కేబినెట్ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. 30 శాతం పెంపుతో పీఆర్సీని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ (CM KCR) గతంలోనే ప్రకటించినప్పటికీ.. కరోనా సంక్షోభంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎప్పటికప్పుడు అది వాయిదా పడుతూ వచ్చింది. పూర్తి సమాచారం కోసం Read more...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook