Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ కేసులతోపాటు.. నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ( డిసెంబరు 1న ) మంగళవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 565 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ మహమ్మారి కారణంగా నిన్న ఒక్క మరణం మాత్రమే సంభవించింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,70,883 కి చేరగా.. మరణాల సంఖ్య 1,462 కి పెరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Telangana: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి


గత 24గంట్లలో ఈ వైరస్ నుంచి 925 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ( Telangana ) కరోనావైరస్ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,60,155 కి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో 9,266 ( Covid-19 ) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96 శాతం ఉండగా.. మరణాల రేటు 0.53 శాతంగా ఉంది. 


Also read: Burevi cyclone live updates: మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఐఎండీ హెచ్చరిక


ఇదిలావుంటే.. మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా 51,562 కరోనా పరీక్షలు చేశారు. వీటితో కలిపి డిసెంబరు 1వ తేదీ వరకు మొత్తం 55,51,620 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 


 


Also read: Farmer protests: కొలిక్కిరాని చర్చలు.. రేపు మరోసారి కేంద్రంతో భేటీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe