Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. కరోనా కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ( డిసెంబరు 11న ) శుక్రవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 635 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నలుగురు (4) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,77,151 కి చేరగా.. మరణాల సంఖ్య 1,489 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: CM KCR: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ భేటీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24 గంటల్లో కరోనా నుంచి 565 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,67,992 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 7,670 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.69 శాతం ఉండగా.. మరణాల రేటు 0.53 శాతంగా ఉంది. Also read: Properties Registration: తొలిరోజే రూ.85 లక్షల ఆదాయం.. నేడు, రేపు సెలవులు రద్దు


ఇదిలావుంటే.. శుక్రవారం తెలంగాణ ( Telangana ) వ్యాప్తంగా 52,308 కరోనా టెస్టులు చేశారు. వీటితో కలిపి డిసెంబరు 11వ తేదీ వరకు మొత్తం 60,81,517 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా.. హైదరాబాద్ పరిధిలో 141 కేసులు నమోదయ్యాయి. Also read: Farmer protests: 17వ రోజుకు రైతుల ఉద్యమం.. నేడు రహదారుల దిగ్బంధం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook