Telangana Corona cases: హైదరాబాద్: తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో కరోనావైరస్ (Coronavirus) కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24గంటల్లో 1,284 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది.  దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 43,780కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 409 కి పెరిగింది. Also read: Covid-19: ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24 గంటల్లో 1,902 మంది కరోనానుంచి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు.  దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 30,607మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,765 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.  తెలంగాణలో ఇప్పటి వరకు 2,52,700 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.   Also read: TS Secretariat: జీ బ్లాక్ కింద గుప్తనిధులు: రేవంత్ రెడ్డి


గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 667 కేసులు నమోదు కాగా.. సంగారెడ్డి జిల్లాలో -86, రంగారెడ్డి జిల్లాలో -68, మేడ్చల్ జిల్లాలో -62, కరీంనగర్ జిల్లాలో 58, నల్లగొండ జిల్లాలో -46,  వరంగల్ అర్బన్ జిల్లాలో -37, వికారాబాద్ జిల్లాలో -35 కేసులు నమోదయ్యాయి.


[[{"fid":"187902","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana covid health bulletin today","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana covid health bulletin today","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు"}},"link_text":false,"attributes":{"alt":"telangana covid health bulletin today","title":"తెలంగాణలో కరోనా కేసులు","class":"media-element file-default","data-delta":"1"}}]]