Telangana High Court: తెలంగాణలో కరోనా వైరస్ నియంత్రణ విషయంలో తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణలో ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలు గాలిలో కల్సిపోతుంటే..ఎందుకు పట్టడం లేదని ప్రశ్నించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మొదటి దశలో పలుమార్లు హైకోర్టు ఆగ్రహానికి గురైన తెలంగాణ ప్రభుత్వం(Telangana government)..ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ (Corona Second wave) విషయంలో కూడా చీవాట్లు తింటోంది. తెలంగాణలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జనసంచారం తగ్గించేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా, ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు ఇవ్వడంలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. థియేటర్లు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. పబ్‌లు, మద్యం దుకాణాల నిర్వహణే మీకు ముఖ్యమా అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది.


జనసంచారం నియంత్రణకు త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం.. ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా లేదా ఆదేశాలు ఇవ్వమంటారా అని తెలంగాణ హైకోర్టు ( Telangana High Court)  హెచ్చరించింది. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో మధ్యాహ్నంలోగా నివేదించాలని ఆదేశించింది. అదే విధంగా సంబంధిత అధికారులు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. 


Also read: Lockdown: ఢిల్లీలో లాక్‌డౌన్ విధించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook