తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. బుధవారం రాత్రి 8 గంటల వరకు ఒక్కరోజులో 2,176 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్ 1,79,246కి చేరింది. అదే సమయంలో ఒక్కరోజే 8 మంది తెలంగాణలో కరోనాతో కన్నుమూశారు. తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,070కి చేరింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఈ మేరకు గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌లో ఈ వివరాలు విడుదల చేసింది. చికిత్స అనంతరం కరోనా బారి నుంచి ఇప్పటివరకూ 1,48,139 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,037 కరోనా యాక్టివ్ కేసులుండగా, మరో 23,929 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. నిన్న ఒక్కరోజే 55,318 కోవిడ్19 (COVID19) నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఓవరాల్‌గా తెలంగాణలో ఇప్పటివరకూ 28,84,215 (28 లక్షల 84 వేలు) కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తాజా బులెటిన్‌లో వెల్లడించారు. MI vs KKR: పాట్ కమిన్స్‌కు మద్దతుగా నిలిచిన కెప్టెన్ దినేష్ కార్తీక్ 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe