Road Accident in Dundigal: హైదరాబాద్ శివారులోని దుండిగల్ (Dundigal) పోలీస్ స్టేషన్ పరిధిలో మరో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రోడ్డు పక్కన ఆగి వున్న లారీని వేగంగా దూసుకొచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బౌరంపేట కోకాకోలా కంపెనీ వద్ద ఈ ప్రమాదం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మృతులను చరణ్, గణేశ్, సంజూగా, గాయపడిన వ్యక్తిని అశోక్‌గా పోలీసులు గుర్తించారు. ఏపీకి చెందిన ఈ నలుగురు హైదరాబాద్‌లోని (Hyderabad) నిజాంపేట్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అశోక్ సూరారంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాద సమయంలో చరణ్ డ్రైవింగ్ చేశాడని... అతివేగమే ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.


మూడు రోజుల క్రితం ఇదే దుండిగల్ పరిధిలోని గండిమైసమ్మ క్రాస్ రోడ్స్ (Gandimaisamma) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఓ బీటెక్ విద్యార్థిని దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. వెనుక నుంచి వచ్చిన లారీ స్కూటీని ఢీకొట్టడంతో యువతి దాని చక్రాల కింద నలిగిపోయింది. స్కూటీపై వెనుక వైపు కూర్చొన్న మరో యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.


Also Read: Gas Leak: రసాయన పరిశ్రమలో విషవాయువు లీక్​...ఒకరు మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook